Indian History Notes" width="825" height="1167" />
Read Online / Preview
2 likes like
share this pdf Share
report this pdf Report
దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన యుగం సంగం కాలం. తమిళ జానపద కథల ప్రకారం, మధ్యయుగ తమిళనాడులో మూడు సంగమ్లు (తమిళ కవుల అకాడమీలు), ముచ్చంగం అని కూడా పిలుస్తారు. పాండ్యుల సామ్రాజ్య పోషణ ఈ సంగమాలను వర్ధిల్లేలా చేసింది. క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం మరియు క్రీ.శ మూడవ శతాబ్దం మధ్య దక్షిణ భారతదేశం (కృష్ణా మరియు తుంగభద్ర నదుల దక్షిణ ప్రాంతం) సంగం కాలంగా పిలువబడింది.
భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది. సుమారుగా 5,00,000 సంవత్సరాల క్రితం నాటి ప్రారంభ మానవులకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి. దీన్ని “నాగరికతకు ఉయ్యాల”గా భావిస్తున్నారు. దక్షిణ ఆసియాలోని మొదటి అతిపెద్ద నాగరికత అయిన సింధు లోయ నాగరికత 3300 నుండి 1300 వరకు భారత ఉపఖండంలోని ఉత్తర-పశ్చిమ భాగంలో వ్యాప్తి చెందింది. క్రీ.పూ 2600 నుండి 1900 వరకు ప్రౌఢ హరప్పా కాలంలో ఆధునిక, సాంకేతిక అధునాతన పట్టణ సంస్కృతి అభివృద్ధి చెందింది. ఈ నాగరికత క్రీ.పూ.
Indian History Telugu
- పూ 4 వ – 3 వ శతాబ్దాలలో భారతీయ ఉపఖండంలో అధిక భాగాన్ని మౌర్య సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. క్రీ.పూ. 3 వ శతాబ్దం నుండి ఉత్తరాన ప్రాకృత, పాలి సాహిత్యం, దక్షిణ భారతదేశంలో తమిళ సంగం సాహిత్యం వృద్ధి చెందాయి.3 వ శతాబ్దంలో వూట్జ్ స్టీల్ దక్షిణ భారతదేశంలో ఉద్భవించి విదేశాలకు ఎగుమతి చేయబడింది.సాంప్రదాయ కాలములో భారతదేశంలోని వివిధ ప్రాంతాలను తరువాతి 1,500 సంవత్సరముల వరకు అనేక రాజవంశాలు పాలించాయి. వాటిలో గుప్త సామ్రాజ్యం అగ్రస్థానంలో నిలిచింది. ఈ కాలాన్ని హిందూ మతానికి, మేధాసంపత్తి పునరుద్ధరణకు సాక్ష్యంగా చెప్పవచ్చు. దీనిని “భారతదేశం శాస్త్రీయ” లేదా ” స్వర్ణ యుగం ” అని వర్ణిస్తారు.
- రెండవ సహస్రాబ్ధి ప్రారంభంలో పతనమైంది. తరువాత ఇనుప యుగం వేద సంస్కృతి కొనసాగింది. ఈ కాలం హిందూమత పవిత్ర గ్రంథాలైన వేదాల కూర్పును చూసింది. ఇది జనపదాలకు (రాచరిక, రాజ్య-స్థాయి విధానాలు) కులాల ఆధారంగా సామాజిక విభజనకు అనుసంధానించబడింది. తరువాత వేద నాగరికత ఇండో-గంగాటిక్ మైదానానికి వరకు అలాగే భారత ఉపఖండంలో చాలా వరకు విస్తరించింది. అలాగే మహాజనపదాలు అని పిలవబడే ప్రధాన రాజకీయాల పెరుగుదలను చూసింది. ఈ సామ్రాజ్యాలలో ఒకటైన మగధ, గౌతమ బుద్ధుడు, మహావీరుడు క్రీ.పూ. 5 వ, 6 వ శతాబ్దాలలో వారి ధారావాహిక తత్వాలు ప్రచారం చేశారు.